కథన కుతూహలం 56

   ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కథకుల కథలు ఇప్పటివరకూ చాలానే చదువుకున్నాం. ఎన్ని చదువుకున్నా ఇంకా చదవవలసిన ఆ ప్రాంతపు రచయితలు చాలామందే వున్నారు. అలాంటి వారినుంచి ఈ వారం శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారిని తీసుకున్నాను. శ్రీ సీతారామమూర్తి గారు 1947లో పొందూరులో జన్మించారు. వారు చిన్నతనం నుంచే కథలూ, కవిత్వమూ, నాటికలూ రాయడం మొదలుపెట్టారు.  తెలుగునాట ఉన్న అన్ని పత్రికలలో వారి కథలు దాదాపు 200 పైనే ప్రచురితమయ్యాయి. తొమ్మిది సార్లు వారు…